ఢిల్లీ చేరుకున్న కిరణ్ !

cm-kiranముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి ఈరోజు బయల్దేరి ఢిల్లీ చేరుకున్నారు. విభజనపై ఏర్పాటైన మంత్రుల బృందంతో సీఎం ఈరోజు మధ్యాహ్నం 12.30నిమిషాలకు సమావేశం కానున్నారు. విభజన అంశం కీలక దశకు చేరుకున్న నేపథ్యంలో.. సీఎం ఢిల్లీ టూర్ మరింత ప్రాధాన్యతను సంతరించుకుంది. అయితే, ఎప్పటిలాగే కిరణ్ ఈసారి కూడా అధిష్టానానికి ధిక్కార స్వరాన్ని వినిపిస్తారా.. ? లేదా.. విభజన పర్వం చివరి అంకానికి చేరుకున్న తరుణంలో అధిష్టానానికి సహకరిస్తా.. ? అన్నది ఆసక్తికరంగా మారింది. విభజనకు కిరణ్ సహకరించని యెడల అధిష్టానం ప్రత్యామ్నాయ ఏర్పాట్లును కూడా ఇప్పటికే చేసుకుందని సమాచారం. ఎదేమైనా.. విభజన అంశం ఢిల్లీలో రాజకీయాలను మరింత వేడెక్కిస్తున్నాయి.