Site icon TeluguMirchi.com

మంత్రులతో ముఖ్యమంత్రి మంతనాలు..!

cm kiranముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి ఈరోజు సాయంత్రం తెలంగాణ, సీమాంధ్ర నేతలతో విడివిడిగా సమావేశమవనున్నట్లు తెలుస్తోంది. తెలంగాణ అంశంపై రేపు సీఎం ఢిల్లీకి వెళ్లనున్న నేపథ్యంలో.. మంత్రులతో సమావేశం ప్రాధాన్యతను సతరించుకొంది. రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల పర్యవేక్షకుడు దిగ్విజయ్ సింగ్ తెలంగాణ, సమైక్యాంధ్రలపై రోడ్ మ్యాప్ తో ఢిల్లీకి రావాలని ఆదేశించిన విషయం తెలిసిందే. అయితే, ఈ నేపథ్యంలో.. గత కొన్ని రోజులుగా రాష్ట్రంలో ఇటు తెలంగాణ, అటు సీమాంధ్ర నాయకుల చేస్తున్న.. సమైక్య, సపరేట్ రాగాలతో.. ఒక్కసారిగా రాష్ట్ర రాజకీయాలు వేడెక్కాయి. నేతల రోడ్ మ్యాప్ అనంతరం ఈ నెల 12న నిర్వహించే కాంగ్రెస్ కోర్ కమిటీ సమావేశంలో తెలంగాణపై తేల్చేస్తామని ఢిగ్గీ రాజా స్పష్టం చేసిన విషయం తెలిసిందే.

Exit mobile version