రాష్ట్రపతితో సీఎం కిరణ్ భేటీ

cm kiranరాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీతో ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి సమావేశమయ్యారు. విభజన నిర్ణయం వెలువడిన అనంతరం రాష్ట్రంలో చోటుచేసుకున్న పరిస్థితులను ముఖ్యమంత్రి రాష్ట్రపతికి వివరించినట్లు తెలుస్తోంది. హైదరాబాద్ ను యూటీ చేస్తారని, రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన రాబోతోందని జాతీయ మీడియా కోడైకూస్తున్న నేపథ్యంలో.. ఈ భేటీ మరింత ప్రాదాన్యతను సంతరించుకుంది. ఈ సమావేశమనంతరం ముఖ్యమంత్రి రాష్ట్రానికి తిరుగు ప్రయాణం కానున్నట్లు సమాచారం.