Site icon TeluguMirchi.com

విభజన సమస్యలను రాష్ట్రపతికి వివరించిన కిరణ్

kiran cmహైదరాబాద్ బొల్లారంలోని రాష్ట్రపతి భవన్ లో రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీతో ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి భేటీ అయ్యారు. రాష్ట్రపతి తో భేటి సందర్భంగా రాష్ట్ర విభజనకు సంబంధించిన పలు అంశాలపై ముఖ్యమంత్రి , రాష్ట్రపతి ప్రణబ్ తో చర్చించినట్లు విశ్వసనీయ సమాచారం. దాదాపు గంటపాటు వీరిద్దరి మధ్య చర్చలు కొనసాగాయి. రాష్ట్ర విభజన వాళ్ళ తలెత్తే కొత్త సమస్యలను రాష్ట్రపతికి వివరించినట్లు తెలుస్తోంది. ప్రధానంగా తాగునీటి ప్రాజెక్టుల కు సంభందించిన సమస్యలు, నిరుద్యోగ సమస్య , సరిహద్దులకు సంబదించి భద్రాచలం, ఇతర ప్రాంతాలు ఆయన దృష్టికి తీసుకెళ్లినట్లు తెలుస్తోంది. హైదరాబాద్ గురించిన చర్చ, విభజన బిల్లులో సమాచారంలో స్పష్టత లేదన్న విషయాన్ని కూడా సీఎం రాష్ట్రపతి దృష్టికి తీసులెళ్ళినట్లు సమాచారం.

Exit mobile version