విభజన సమస్యలను రాష్ట్రపతికి వివరించిన కిరణ్

kiran cmహైదరాబాద్ బొల్లారంలోని రాష్ట్రపతి భవన్ లో రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీతో ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి భేటీ అయ్యారు. రాష్ట్రపతి తో భేటి సందర్భంగా రాష్ట్ర విభజనకు సంబంధించిన పలు అంశాలపై ముఖ్యమంత్రి , రాష్ట్రపతి ప్రణబ్ తో చర్చించినట్లు విశ్వసనీయ సమాచారం. దాదాపు గంటపాటు వీరిద్దరి మధ్య చర్చలు కొనసాగాయి. రాష్ట్ర విభజన వాళ్ళ తలెత్తే కొత్త సమస్యలను రాష్ట్రపతికి వివరించినట్లు తెలుస్తోంది. ప్రధానంగా తాగునీటి ప్రాజెక్టుల కు సంభందించిన సమస్యలు, నిరుద్యోగ సమస్య , సరిహద్దులకు సంబదించి భద్రాచలం, ఇతర ప్రాంతాలు ఆయన దృష్టికి తీసుకెళ్లినట్లు తెలుస్తోంది. హైదరాబాద్ గురించిన చర్చ, విభజన బిల్లులో సమాచారంలో స్పష్టత లేదన్న విషయాన్ని కూడా సీఎం రాష్ట్రపతి దృష్టికి తీసులెళ్ళినట్లు సమాచారం.