Site icon TeluguMirchi.com

ఆజాద్ తో సీఎం సుదీర్ఘ చర్చలు !

kiran-azadముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి గతరెండు రోజులుగా ఢిల్లీలో అధిష్టానం పెద్దలతో భేటీ అవుతూ.. బిజిబిజీగా గడుపుతున్నారు. ఇప్పటికే కాంగ్రెస్ అధినేత్రి సోనియాగాంధీ, రాహుల్ గాంధీ.. తదితరులతో భేటీయైన సీఎం కిరణ్ తాజాగా ఈరోజు ఉదయం రాష్ర్ట వ్యవహారాల ఇన్ ఛార్జ్ గులాంనబీ ఆజాద్ తో మరో దఫా సమావేశమయ్యారు. కళంకిత మంత్రులు, మంత్రివర్గంలో మార్పులు.. తదితర అంశాలు ఈ సమావేశంలో చర్చకు వచ్చినట్లు తెలుస్తోంది. అయితే గతరెండు రోజులుగా అధిష్టాన పెద్దలతో సమావేశమవుతున్న సీఎం కళంకిత మంత్రులు రాజీనామా చేయాల్సిన అవసరం లేదని అభిప్రాయపడుతున్నట్లు తెలుస్తోంది. కేంద్రంలో పరిస్థితులువేరు… రాష్ర్టంలో పరిస్థితులు వేరని సీఎం కిరణ్ అభిప్రాయపడినట్లు సమాచారం. రాష్ర్టంలో ప్రత్యేక పరిస్థితులు ఉన్నందున కళంకిత మంత్రులను రాజీనామాలు అవసరం లేదని సీఎం అధిష్టానాన్ని ఒప్పించే పనిలో ఉన్నట్లు తెలుస్తోంది. కాగా, సీఎం కిరణ్ ఢిల్లీ టూర్ ని ముగించుకొని ఈరోజు సాయంత్రం హైదరాబాద్ చేరుకోనున్నారు.

Exit mobile version