అజ్ఞాతం వీడనున్న సీఎం..!

cm kiranmముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి అజ్ఞాతం వీడనున్నారు.. అదేనండీ..రాష్ట్ర విభజన అనంతరం దాదాపుగా అజ్ఞాతంలో ఉన్నట్టుగానే వ్యవహరించిన కిరణ్ ఇక ప్రజల్లోకి రావాలని నిర్ణయించుకునట్టు తెలుస్తోంది. ఈరోజు సాయంత్రం 7గంటలకు మీడియా సమావేశంలో పాల్గొననున్నారు. అధిష్టానం తెలంగాణ ప్రకటించిన అనంతరం గత 9రోజులుగా బాహ్యదర్శనం ఇవ్వని సంగతి తెలిసిందే. ప్రత్యేక తెలంగాణ ప్రకటన తరవాత మొదటిసారి సీఎం ప్రజలను ఉద్దేశించి మాట్లాడనున్నారు. కాగా, సీఎం కనిపించటం లేదని సమైక్యవాదులు కరపత్రాలతో విన్నూతన నిరసన తెలిపిన విషయం తెలిసిందే.