Site icon TeluguMirchi.com

సీఎం గోబ్యాక్ !!

cm kiranగాంధీ భవన్ లో సీఎం కిరణ్ కుమార్ రెడ్డికి తెలంగాణ సెగ తగిలింది. 65వ గణతంత్ర దినోత్సవం సందర్భంగా ఆదివారం నాంపల్లిలోని గాంధీ భవన్‌లో జరిగిన కార్యక్రమంలో పిసిసి చీఫ్ బొత్స సత్యనారాయణ జాతీయ జెండాను ఎగురవేశారు. సీఎం కిరణ్‌కుమార్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి దామోదర రాజనరసింహ, ఇతర కాంగ్రెస్ నేతలు ఇందులో పాల్గొన్నారు. ఈ సందర్భంగా టి-కాంగ్రెస్ నేతలు తదితరులు సీఎం కిరణ్ గోబ్యాక్ అంటూ కిరణ్ వ్యతిరేకంగా పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. దీంతో కొద్దిసేపు ఉద్రిక్త పరిస్థితి ఏర్పడింది.

అసెంబ్లీలో టి-ముసాయిదా బిల్లు పట్ల ముఖ్యమంత్రి అనుసరిస్తున్న తీరు పై అనేక విమర్శలు వస్తున్న సంగతి తెలిసిందే. రాష్ట్ర విభజనకు తాను వ్యతిరేకమంటూ మొదటి నుంచి సీఎం కిరణ్ చెబుతునే ఉన్నారు. ఆ క్రమంలో అసెంబ్లీలో చర్చకు వచ్చిన ఆంధ్రప్రదేశ్ పునర్ వ్యవస్థీకరణ బిల్లు అసమగ్రంగా ఉందని తిప్పి కేంద్రానికి పంపాలని స్పీకర్ కు శనివారం సభానాయకుడిగా కిరణ్ నోటీసు ఇచ్చిన సంగతి తెలిసిందే. ఇది టి-కాంగ్రెస్ నేతలు, తదితరులకు ఆగ్రహం తెప్పించింది. సీఎం కిరణ్ కుమార్ రెడ్డి తెలంగాణ బిల్లుపై రాజ్యాంగ ఉల్లంఘనకు పాల్పడుతున్నారని వాదన వినిపిస్తోంది.

Exit mobile version