అసెంబ్లీలో టి-ముసాయిదా బిల్లు పట్ల ముఖ్యమంత్రి అనుసరిస్తున్న తీరు పై అనేక విమర్శలు వస్తున్న సంగతి తెలిసిందే. రాష్ట్ర విభజనకు తాను వ్యతిరేకమంటూ మొదటి నుంచి సీఎం కిరణ్ చెబుతునే ఉన్నారు. ఆ క్రమంలో అసెంబ్లీలో చర్చకు వచ్చిన ఆంధ్రప్రదేశ్ పునర్ వ్యవస్థీకరణ బిల్లు అసమగ్రంగా ఉందని తిప్పి కేంద్రానికి పంపాలని స్పీకర్ కు శనివారం సభానాయకుడిగా కిరణ్ నోటీసు ఇచ్చిన సంగతి తెలిసిందే. ఇది టి-కాంగ్రెస్ నేతలు, తదితరులకు ఆగ్రహం తెప్పించింది. సీఎం కిరణ్ కుమార్ రెడ్డి తెలంగాణ బిల్లుపై రాజ్యాంగ ఉల్లంఘనకు పాల్పడుతున్నారని వాదన వినిపిస్తోంది.