వ్యవసాయ రంగంలోకి యువత రావాలి : సీఎం

cm kiran.jpjHICCలో జరుగుతున్న ప్రపంచ వ్యవసాయ సదస్సులో ముఖ్యమంత్రి కిరణ్ కుమార్‌ రెడ్డి పాల్గొన్నారు. వ్యవసాయరంగం వైపు యువత మొగ్గు చూపక పోవడంతో భవిష్యత్ ఆందోళనకరంగా మారబోతోందని ఆయన అన్నారు. వర్షాలు, ప్రకృతి విపత్తులు రైతులను దెబ్బతీస్తున్నాయని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ఎరువులు, విత్తనాల ధరలు పెరగడం వల్ల పెట్టుబడులు పెరిగాయన్నారు. రైతులకు పెట్టబడి రాయితీ ఇస్తున్నా అవి సరిపోవడం లేదన్నారు. ప్రభుత్వాల కృషి ఫలితంగానే గతంలో కంటే రైతులకు రుణపరపతి మెరుగైందని పేర్కొన్నారు.