ముఖ్యమంత్రి కోటగిరిలోని తెలంగాణ మంత్రులు కూడా సూటీగా సీఎం కిరణ్ పై చురకలేస్తున్నారు. ఇదిలానే కొనసాగితే లాభం లేదనుకున్నారేమో సీఎం.. సీమాంధ్ర, తెలంగాణ మంత్రులను రేపు విందుకు ఆహ్వానించారు.ఇరు ప్రాంతాల్లో నెలకొన్న పరిస్థితులపై చర్చించేందుకే ముఖ్యమంత్రి ఈ విందు సమావేశాన్ని ఏర్పాటు చేశారని సమాచారం. సీమాంధ్ర ఉద్యమానికి సీఎం కిరణే సారధ్యం వహిస్తారని, సమైక్య పేరిట సీఎం కొత్త పార్టీ పెట్టబోతున్నారని, సమైక్య కు మద్దతుగా సీఎం పాదయాత్ర చేయబోతున్నారని వార్తలొస్తున్న నేపథ్యంలో.. రోజు రోజుకు ముఖ్యమంత్రి పట్ల టీ-కాంగ్రెస్ నేతల్లో అసహనం పెరిగిపోతోంది. అధిష్టాన నిర్ణయానికి కట్టుబడి రాష్ట్ర విభజనకు సహకరించాల్సిందేనని ముఖ్యమంత్రిని టీ-మంత్రులు కోరుతున్నారు. విందు పేరిట ముఖ్యమంత్రి నేతల మధ్య నెలకొన్న విభజన రాజకీయాన్నికాస్త తగ్గించాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది. అమెరికాలో వున్న అధినేత్రి సోనియా గాంధీ కూడా రేపోమాపో తిరిగి రానుంది. రాష్ట్ర పరిస్థితిపై మరోసారి అదినేత్రి ఆరా తీసే లోపు మంత్రుల మధ్య నెలకొన్న దూరాన్ని తగ్గించాలనేదే సీఎం ప్లాన్ లా వుంది. అలా చేస్తే ఈ సమైక్య స్టార్ బ్యాట్స్ మెన్ కు అధిష్టానం దగ్గర మరోసారి సమైక్యం కోసం బ్యాటింగ్ చేసే అవకాశం కూడా దొరుకుందని భావిస్తున్నట్లు తెలుస్తోంది. ఇదే గనుక జరిగి విభజనను కొన్ని రోజులైనా సాగదీయగలిగితే సీమాంధ్రలో సూపర్ మైలేజ్ సాధించవచ్చు, అధిష్టానం ఆదేశమని తెలంగాణలో కూడా లాక్కురావచ్చనేది సీఎం అభిమతంగా విశ్లేషకులు భావిస్తున్నారు. మరి ముఖ్యమంత్రి విందు రాజకీయం ఎంత వరకు ఫలిస్తుందో వేచి చూడాలి.