Site icon TeluguMirchi.com

సీఎం హస్తినా టూర్..!

cm-kiranముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి శనివారం ఢిల్లీకి వెళ్లనున్నారు. రేపు సాయంత్రం 5 గంటలకు సీఎం హస్తినాకు బయలుదేరి వెళతారు. అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులు, న్యాయమూర్తులతో న్యాయపరమైన అంశాలపై ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ అధ్యక్షతన జరగనున్న సమావేశంలో సీఎం పాల్గొననున్నట్లు తెలుస్తోంది. అనంతరం సీఎం కిరణ్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీ, కాంగ్రెస్ రాష్ట్ర వ్యవహారాల ఇన్ ఛార్జ్ గులాంనబీ ఆజాద్, తదితర పార్టీ పెద్దలతో భేటీ అయ్యే అవకాశం ఉన్నట్లు సమాచారం. గతకొద్ది రోజులుగా విద్యుత్ ఛార్జిలపెంపు తదితర అంశాలతో పాటుగా.. తాజా రాష్ర్ట రాజకీయ పరిణామాలపై సీఎం అధిష్టానంతో చర్చించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.

Exit mobile version