Site icon TeluguMirchi.com

ఢిల్లీ వెళ్లిన కిరణ్ !

kiranముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి ఈరోజు (శుక్రవారం) ఉదయం ఢిల్లీ బయలుదేరి వెళ్లారు. ఢిల్లీలో ఈరోజు జరిగే కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రుల సమావేశంలో కిరణ్ పాల్గొననున్నారు. ఈ సమావేశానికి కాంగ్రెస్ అధినేత్రి సోనియాగాంధీ కూడా హాజరుకానున్నారు. గడచిన మూడు నెలల్లో సీఎం కిరణ్,  అధినేత్రి సోనియా గాంధీతో భేటీ అవ్వలేదు. చాలా రోజుల తర్వాత కిరణ్ సోనియా తో సమావేశం కానున్న నేపథ్యంలో.. కిరణ్ ఢిల్లీ టూర్ మరింత ప్రాధాన్యతను సంతరించుకొంది. టీ-బిల్లుపై అసెంబ్లీలో చర్చ ప్రారంభమైన నేపథ్యంలో.. సోనియా, కిరణ్ కు ఏమైనా.. సూచనలు చేయనున్నారా.. ? లేదా.. ఎప్పటిలాగా కిరణ్ అధిష్టానాన్ని ధిక్కరించే విధంగా వ్యవహారిస్తారా.. ? అనేది ఆసక్తిగా మారింది.

Exit mobile version