ఏ పార్టీలోకి వెళ్లే అవకాశం లేని కొందరు నేతలు మాత్రం తమ రాజకీయ భవిష్యత్తుపై తలలు పట్టుకుంటున్నారు. ఇలా ఏ పార్టీలో ఇమడని వాళ్లు ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి కొత్త పార్టీ పురుడు పోసుకుంటుందనే ఆశతో ఉన్నట్లు తెలుస్తోంది. కిరణ్ కొత్త పార్టీ పెడితే తమ తమ రాజకీయ భవిష్యత్ కు ఢోకా వుండని వారు భావిస్తున్నట్లు తెలుస్తోంది. ఇక కిరణ్ మో.. జనవరి 23దాక ఆగి.. అందరితో చర్చించి నిర్ణయం తీసుకుందామని తాజాగా స్పష్టం చేసినట్లు సమాచారం.
విభజన ముసాయిదా బిల్లుపై చర్చ అనంతరం ముఖ్యమంత్రి కిరణ్ కొత్త పార్టీ పెట్టనున్నారా.. ? లేదా.. ? సీమాంధ్ర అభివృద్ధి కాంగ్రెస్ దేనని ప్రచారం మొదలుపెడతారా.. ? అనేది వేచి చూడాలి. మరోవైపు, సీఎం మూడునెలల అనంతరం రేపు అధినేత్రి సోణియా గాంధీతో సమావేశం కానున్నారు.