రాష్ర్టంలో ఉద్యమాలతో సతమతమవుతున్న నేపథ్యంలో… ప్రభుత్వం శాంతిభద్రతల విషయంలో కఠినంగా వ్యవహరించిందని కిరణ్ తెలిపారు. అయితే..ఇటు తెలంగాణ అటు సమైక్యాంధ్రా ఉద్యామాలు జరుగుతున్న సమయంలోనూ.. విద్యార్థుల చదువులకు ఆటంకం కలగకుండా చూశామని ఆయన అన్నారు. ఉద్యోగాల భర్తీ విషయంలోనూ.. ఎలాంటి అవకతవకలు చోటుచేసుకోకుండా చర్యలు తీసుకోవడంలో ప్రభుత్వం సఫలమైందని సీఎం అన్నారు.
తన సొంత నియోజకవర్గం మాదిరిగా రాష్టంలో అన్ని ప్రాంతాల అభివృద్ధి కార్యక్రమాలు చేపడతామని సీఎం స్పష్టం చేశారు. 2014 లో కాంగ్రెస్ ను మళ్లీ అధికారంలోకి తీసుకురావాల్సిన బాధ్యత కార్యకర్తలపై ఉందని కిరణ్ చెప్పారు. కాగా, తమ గొప్పలు తామే చెప్పుకోవాలన్నట్లుగా..కిరణ్ రెచ్చిపోయి మరీ.. గొప్పలు వల్లించినట్లుగా రాజకీయ విశ్లేషకులు గుసగుసలాడుతున్నారు.