ముఖ్యమంత్రికి అస్వస్థత!

cm-kiranముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి స్వల్ప అస్వస్థతకు గురైనట్లు తెలుస్తోంది. దీంతో.. కీలకమైన అంశాలు చర్చకు వచ్చే అవకాశం వున్నా.. కిరణ్ శాసనసభకు గైర్హాజరయ్యే అవకాశం వున్నట్లు సమాచారం. అస్వస్థత కారణంగా ముఖ్యమంత్రి నిన్న కూడా ఇంటికి పరిమితమయ్యారు. మంత్రులు రఘువీరా, ఆనం.. తదితరులు పరామర్శించారు. అయితే, ఈరోజు కిరణ్ శాసనసభకు హాజరుకావాలని భావించినప్పటికినీ.. ఆరోగ్యం పూర్తిగా కుదుటపడలేదని ఆయన వర్గం నేతలు చెబుతున్నారు.