బిల్లు వెనక్కి పంపాలని ఛైర్మన్ కు మంత్రి సి.రామచంద్రయ్య నోటీసిచ్చారు.
టీ-బిల్లుపై స్వీకర్ కు సీఎం ఇచ్చిన నోటీసు రాజకీయ వర్గాల్లో పెద్ద దుమారాన్నే లేపింది. కిరణ్ నిర్ణయాన్ని సీమాంధ్ర నేతలు స్వాగతిస్తుండగా, టీ-నేతలు మండిపడుతున్నారు. స్వీకర్ నోటీసును వ్యతిరేకిస్తూ.. టీ-నేతలు గండ్ర, కేటీఆర్, ఈటేల.. తదితరులు స్వీకర్ కలిశారు.
విభజన తీర్మాణాన్ని వెనక్కి పంపడంపై కిరణ్ ఇచ్చిన నోటీసుల నేపథ్యంలో.. ఇటు సమైక్య, అటు సపరేట్ నేతల మధ్య అసలైన యుద్దం ఆరంభమైనట్లు కనిపిస్తోంది. మరీ.. సభలో ఈ అంశానికి సంబంధించిన తీర్మాణం చేస్తారా.. ? అందుకు టీ-నేతలు సహకరిస్తారా.. ? అన్నది ఆసక్తిగా మారింది. ఏదేమైనా.. అసలైన సభాచర్చకు సమయం ఆసన్నమైనట్లు తెలుస్తోంది.. సో.. ప్రజలారా.. నేతల చిత్రవిచిత్ర సన్నివేశాలను తిలకించడానికి రెడీగా వుండండి.. !!