పార్లమెంటులో ప్రవేశపెట్టే బిల్లునే రాష్ట్రపతికి కేంద్రం పంపాలని,ఆ బిల్లునే రాష్ట్ర శాసనసభకు పంపాలని అబిప్రాయపడ్డారు. అందువల్లనే తాను ఇది ఒరిజినల్ బిల్లు కాదని అంటున్నానని,ముసాయిదా బిల్లు అని ఆయన అన్నారు. ఒరిజినల్ బిల్లు కాదు కాబట్టే తాను తిరస్కరణ నోటీసు ఇచ్చానని అన్నారు. అయితే ఈ విషయంలో కిరణ్ అనేక విమర్శలు వస్తున్నాయి. సభలో కిరణ్ ఏడుగంటలు ప్రశంగించాక ఇప్పుడు తిరస్కరణ నోటిసు ఇవ్వడం సరికాదని తెలంగాణ నేతలు మండిపడుతున్నారు.