Site icon TeluguMirchi.com

హస్తినాలో సీఎం బిజీబిజీ !

cm kiranముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి ఢిల్లీలో అధిష్టాన పెద్దలతో సమావేశమవుతూ బిజిబిజీగా ఉన్నారు. ఈరోజు (బుదవారం) ఉదయం రాష్ట్ర వ్యవహారా ఇన్ ఛార్జ్ దిగ్విజయ్ సింగ్ తో సమావేశమయ్యారు. అనంతరం కేంద్ర హోంశాఖ మంత్రి సుశీల్ కుమార్ షిండే సమావేశమయ్యారు. రాష్ట్రంలో.. ముఖ్యంగా సీమాంధ్రలో చోటుచేసుకున్న పరిణామాలను సీఎం అధిష్టాన పెద్దలకు వివరించినట్లు తెలుస్తోంది. తదనంతరం ముఖ్యమంత్రి రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీతో సమావేశమయ్యే అవకాశాలున్నట్లు తెలుస్తోంది. మరి.. రాష్ట్రాన్ని సమైక్యంగా వుంచేందుకు సీఎం ప్రయత్నాలు ఫలిస్తాయో లేదో వేచి చూడాలి.

Exit mobile version