Site icon TeluguMirchi.com

ధర్నాస్థలం నుంచే ప్రభుత్వాన్ని నడిపిస్తాం !

kjreevalరానున్న లోక్ సభ ఎన్నికల్లో కాంగ్రెస్ కు సరైన గుణపాఠం చెబుతామని ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ అన్నారు. ఢిల్లీలో మహిళల భద్రత కోసమే తాము ధర్నా చేస్తున్నామని అన్నారు. ధర్నా సమయంలో ఏం జరిగినా కేంద్రానిదే బాధ్యతని చెప్పారు. ప్రస్తుతం ఢిల్లీలోని రైల్వే భవన్ వద్ద మద్దతు దారులతో కేజ్రీవాల్ ధర్నా కొనసాగుతోంది. ధర్నా స్థలం వద్దే ఆయన ఫైళ్లను పరిశీలించారు. ధర్నా వల్ల ప్రభుత్వ పనులకు ఆటంకం ఏర్పడదని, ఇక్కడి నుండే ప్రభుత్వాన్ని నిర్వహిస్తామని తెలిపారు.

Exit mobile version