Site icon TeluguMirchi.com

కుటుంబం సమేతంగా చంద్రబాబు ఉగాది వేడుకలు


విజయవాడలోని తుమ్మలపల్లి కళాక్షేత్రంలో ఉగాది వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. ఈ వేడుకలు రాష్ట్ర భాషా సాంస్కృతిక శాఖ, దేవాదాయ ధర్మాదాయశాఖల ఆధ్వర్యంలో జరుగుతున్నాయి. ఈ వేడుకల్లో ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. సీఎంతో పాటు ఆయన సతీమణి నారా భువనేశ్వరి, దేవాన్ష్ పాల్గొన్నారు.

ఈ సందర్భంగా.. రాష్ట్ర ప్రజలందరికీ సీఎం చంద్రబాబు ఉగాది శుభాకాంక్షలు తెలిపారు. విళంబి నామ సంవత్సర ఉగాది తెలుగు ప్రజల జీవితాల్లో ఆరు రకాల రుచులను సమపాళ్లలో అందించాలని ఆయన ఆకాంక్షించారు. కాగా, పండుగను పురస్కరించుకుని వివిధ రంగాల్లో ప్రముఖులైన 47మందికి కళారత్న(హంస), 99మందికి ఉగాది పురస్కారాలు విజయవాడలోని తుమ్మలపల్లి కళాక్షేత్రంలో అందించారు

Exit mobile version