Site icon TeluguMirchi.com

చిరంజీవికి సమైక్యసెగ

chiranjeeviకేంద్ర మంత్రి చిరంజీవికి తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రిలో సమైక్య సెగ తగిలింది. గోదావరి గట్టు మీద దివంగత నటుడు ఎస్వీ రంగారావు విగ్రహాన్ని ఆవిష్కరించేందుకు ఇక్కడికి వచ్చిన చిరంజీవి ని న్యాయవాద జేఏసీ సభ్యులు అడ్డుకున్నారు. జై సమైక్యాంధ్ర అని నినాదాలు చేసుకుంటూ వాహనంపైకి న్యాయవాదులు దూసుకెళ్లారు. అయితే వారిని పోలీసులు అడ్డుకుని, చిరంజీవి కాన్వాయ్ వెళ్లేందుకు మార్గం సుగమం చేశారు.

Exit mobile version