ఎన్నికల ప్రచారంలో చిరు బిజీ బిజీ

chiruకర్ణాటక ఎన్నికల ప్రచారంలో కేంద్ర మంత్రి చిరంజీవి బిజీగా గడుపుతున్నారు. ఏపీ కాంగ్రెస్ నేతలు పలువురు ఇక్కడ విస్తృతంగా ప్రచారం నిర్వహిస్తున్నారు. పావనగడ నియోజకవర్గంలో ప్రచారంలో ఉన్న చిరంజీవి మాట్లాడుతూ .. అవినీతి భారతీయ జనతా పార్టీ ప్రభుత్వాన్ని ఇంటికి పంపించాలని పిలుపునిచ్చారు. కాంగ్రెసు పార్టీతోనే రాష్ట్రంలో అభివృద్ధి సాధ్యమని చిరంజీవి అన్నారు. చిరంజీవి ప్రచార ర్యాలీకి భారీగా ప్రజలు హాజరయ్యారు. ఆయనను చూసేందుకు ఆసక్తి చూపారు. చిరంజీవితోపాటు మంత్రులు రఘువీరా రెడ్డి, గంటా శ్రీనివాస్ ప్రచారంలో పాల్గొన్నారు.