Site icon TeluguMirchi.com

ఛార్జీల పెంపు ప్రతిపాదన మాత్రమే..!

manikya-varaprasadవిద్యుత్ ఛార్జీల పెంపుపై ప్రభుత్వం ఇంకా నిర్ణయం తీసుకోలేదని మంత్రి మాణిక్యవరప్రసాద్ తెలిపారు. విద్యుత్ ఛార్జీల పెంపు ప్రతిపాదన ఇంకా ఈఆర్ సీ దశలోనే ఉందని స్పష్టం చేశారు. అందరి అభిప్రాయాలు విన్నాక మంత్రివర్గంలో చర్చించి నిర్ణయం తీసుకుంటామని వెల్లడించారు. సామాన్యులపై భారం పడకుండా చూసుకుంటామని తెలిపారు. అయితే విద్యుత్ ఛార్జీల పెంపుపై ఇప్పటికే ప్రతిపక్షాలే కాకుండా స్వపక్షంలోని కొందరు నేతలు బహిరంగంగా విమర్శిస్తున్న నేపథ్యంలో ప్రభుత్వం పునరాలోచనలో పడ్డట్లు తెలుస్తుంది.

Exit mobile version