Site icon TeluguMirchi.com

అమిత్ షాపై ఛార్జిషీటు

amith-shah
భాజాపా జాతీయ అధ్యక్షుడు అమిత్ షాపై ఛార్జీషీటు దాఖలైంది. ఉత్తరప్రదేశ్ లోని ముజఫర్ నగర్ పోలీసులు స్థానిక కోర్టులో ఛార్జిషీటును దాఖలు చేశారు. గత ఎన్నికల ప్రచారంలో వివాదాస్పద వ్యాఖ్యలు చేసినందుకు అమిత్ షా పై ఈ ఛార్జీషీటును దాఖలు చేశారు. గత ఏప్రిల్ 4న ఓ సభలో అమిత్ షా చేసిన ప్రసంగం తాలూకు వీడియో క్లిప్పింగ్ ల ఆధారంగా వారు ఈ కేసు నమోదు చేసినట్లు తెలుస్తోంది. కాగా, గత సాధారణ ఎన్నికలో అమిత్ షా ఉత్తర ప్రదేశ్ భాజాపా ఇన్ ఛార్జ్ గా వ్యవహరించిన విషయం తెలిసిందే.

Exit mobile version