ఖమ్మం జిల్లాలో సాగుతున్న బాబు యాత్ర

cbn padayatraటీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు వయోభారాన్ని సైతం లెక్కచేయకుండా 63 ఏళ్ళ వయసులో నిరంతరం ప్రజల సమస్యలు తెలుసుకునేందుకు చేస్తున్న వస్తున్నా.. మీకోసం పాదయాత్ర జిల్లాలో ఐదో రోజుకు చేరింది. వెంకటగిరి క్రాస్‌రోడ్‌ వద్ద గ్రానైట్‌ పరిశ్రమల యజమానులు ఆయనతో ఆదివారం సాయంత్రం సమావేశమయ్యారు. తాము నష్టాలపాలవుతున్నామని, అప్పుల ఊబిలో చిక్కుకుపోతున్నామని వారు విద్యుత్‌ కోతలపై ఆవేదన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ గ్రానైట్‌ పరిశ్రమ అభివృద్ధికి తాను కృషిచేస్తానని, నూతనంగా నిర్మించే పరిశ్రమలకు ఉన్న అడ్డంకులు తొలగిస్తానని వారికి హామీ ఇచ్చారు.