Site icon TeluguMirchi.com

శ్రీవారి సేవలో చంద్రబాబు!

babu(1)

తెదేపా అధినేత చంద్రబాబునాయుడు తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. ఉదయం వీఐపీ ప్రారంభ దర్శన సమయంలో సతీమణి భువనేశ్వరి, తనయుడు లోకేశ్‌లతో కలిసి చంద్రబాబు స్వామివారి సేవలో పాల్గొన్నారు. ప్రత్యేక విమానంలో హైదరాబాద్ నుంచి తిరుపతికి వచ్చిన చంద్రబాబు రోడ్డు మార్గంలో తిరుమలకు చేరుకున్నారు. ఆలయ మహాద్వారం వద్ద తితిదే ఛైర్మన్ కనుమూరి బాపిరాజు, ఆలయ అధికారులు చంద్రబాబుకు ఘన స్వాగతం పలికారు. స్వామివారిని దర్శించుకున్న చంద్రబాబు కుటుంబసభ్యులకు రంగనాయకుల మండపంలో పండితులు వేదాశీర్వచనం చేశారు. అనంతరం ఆలయ అధికారులు చంద్రబాబుకు శ్రీవారి తీర్థప్రసాదాలను అందజేశారు.

Exit mobile version