సత్తా ఉంది.. సవాలు విసురుతున్నా: బాబు

babuఅసెంబ్లీ సాక్షిగా ప్రత్యర్థులకు సవాల్ విసిరారు తెదేపా అధినేత చంద్రబాబు నాయుడు. ప్రతి ఆరోపణకు, రాష్ట్రాభివృద్ధికి, తెలంగాణ అభివృద్ధికి ఏం చేశామో సమాధానం ఇస్తామని… కాదని ఎవరైనా అనగలిగితే చర్చకు రావాలని బాబు సవాలు విసిరారు. శాసనసభలో పయ్యావుల కేశవ్ అభిప్రాయవ్యక్తీకరణ సందర్భంగా ఆసక్తికర సంఘటనలు చోటు చేసుకున్నాయి. టీడీపీ అభిప్రాయం చంద్రబాబుతో చెప్పించాలన్ని డిమాండ్ పై బాబు ఘాటుగా స్పందించారు. హరీష్ రావు, శైలజానాథ్ మరికొందరు చేసిన ప్రతి ఆరోపణపైనా సమాధానం చెబుతానని అన్నారు. ఎన్టీఆర్ మరణంతో పాటు మరిన్ని అంశాలపై సమర్థవంతంగా, సమగ్రంగా వివరిస్తామన్నారు. బాబు సవాల్ తో ప్రత్యర్థి నేతలు నిశిబ్దంగా వుండటం విశేషం.