Site icon TeluguMirchi.com

సీమాంధ్ర అభివృద్ధి తెదేపాకే సాధ్యం : బాబు

tdp-prajagarjana-193x170

పసుపుదళంతో కడప కళకళాడుతోంది. కడపలో ఎక్కడా చూసిన పసుపమయం అయింది. కడప తెదేపా ప్రజాగర్జన ప్రజలతో హోరెత్తింది. ఈ సందర్భంగా తెదేపా అధినేత చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ.. సీమాంధ్రను ఎలా అభివృద్ధి చేసి చూపిస్తానో పూసగుచ్చినట్లు చెప్పారు. గతంలో.. తెదేపా అభివృద్ధికి ఏవిధంగా పాటుపడింది. భవిష్యత్ లో ఎలాంటి ప్రణాళికతో ముందుకెళ్తుందో స్పష్టంగా వివరించారు.

చంద్రబాబు ప్రసంగంలోని ముఖ్యంశాలు :

* సీమాంధ్ర అభివృద్ధి బాద్యత తెదేపా తీసుకుంటుంది
* అధికారంలోకి వస్తే రైతుల రుణం తీర్చుకుంటా
* మహిళల రక్షణకు పసుపుదళం ఏర్పాటు
* దేశమంతా ఆశ్చర్యపోయేలా సీమాంధ్ర అభివృద్ధి బాద్యత తెదేపాదే
* డ్వాక్రా రుణాల మాఫీ
* ముస్లింలకు భద్ర
* దేశ ప్రయోజనాల కోసమే భాజాపా పొత్తు
* బడుగు, బలహీన వర్గాలు న్యాయం

చంద్రబాబు ప్రసంగం ఇంకా కొనసాగుతుంది. ప్రసంగంలో బాబు కాంగ్రెస్, వైకాపాలపై నిప్పులు చెరుగుతున్నారు. కాంగ్రెస్ ను ఓడించి కడప ఫౌరుషం చూపించాలని ప్రజలకు బాబు పిలుపునిచ్చారు. నీతివంతమైన పోరాటంలో ప్రజలు కలసి రావాలని పిలుపునిచ్చారు.

Exit mobile version