పునాదుల నుంచి అభివృద్ధి చేస్తాం!

cbnnn

అభివృద్ధి మంత్రంతో సీమాంధ్ర ప్రజల మనసులను దోచుకున్నాడు తెదేపా అధినేత చంద్రబాబు నాయుడు. బాబు నిజాయితీగా, సూటిగా, స్పష్టంగా చెప్పిన మాటలను సీమాంధ్ర ప్రజలు 100 శాతం నమ్మారు. సీమాంధ్రను అభివృద్ధి చేసే సత్తా చంద్రబాబు కే వుందని వారు భావించారు. ఫలితం సార్వత్రిక ఎన్నికల్లో తెదేపాకు ఘన విజయాని కట్టబెట్టారు.

ప్రజల నమ్మకానికి తగ్గట్టుగానే చంద్రబాబు అభివృద్ధి పనిని మొదలెట్టాడానికి రెడీ అయిపోయారు. ఈ నేపథ్యంలో.. ఈరోజు (శనివారం) ఉదయం కుటుంబ సభ్యులతో కలసి ఎన్టీఆర్ ఘాట్ కు చేరుకొని నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, సీమాంధ్రను స్వర్ణాంధ్రప్రదేశ్ గా తీర్చిదిద్దేందుకు ఎన్టీఆర్ ఆశీర్వాదాలు తీసుకునేందుకు వచ్చామని తెలిపారు.

సీమాంధ్ర, తెలంగాణ రాష్ట్రాలను అభివృద్ధి చేయాల్సిన బాధ్యత తమపై ఉందని బాబు అన్నారు. ముఖ్యంగా సీమాంధ్రను పునాదుల నుంచి అభివృద్ధి చేయాల్సిన అవసరం ఉందని చెప్పారు. మొత్తానికి… సీమాంధ్ర అభివృద్ధి పనిని ఈరోజు నుండి ప్రారంభించడానికి బాబు రెడీ అయిపోయారన్న మాట.