తిరుమలకు పూర్వ వైభవం తెస్తాం : బాబు

babu tirumala tour

తెదేపా అధినేత చంద్రబాబు నాయుడు ఈరోజు ఉదయం తిరుమల శ్రీవారిని దర్శించుకొన్నారు. అనంతరం భక్తుల క్యూ లైన్లను పరిశీలించి.. వారి ఇబ్బందులను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా చంద్రబాబు విలేకరులతో మాట్లాడుతూ.. తిరుమలను పూర్తిగా ప్రక్షాళన చేస్తామని స్పష్టం చేశారు. తిరుమలలో గోవింధ నామస్మరణ తప్ప మరేది వినిపించరాదని అన్నారు. స్వామి వారి అనుగ్రహంతో.. రాష్ట్రంలో అవినీతి లేని, పేదరికం లేని సమాజం కోసం కృషి చేస్తానని చెప్పారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా స్వల్పకాలిక, దీర్ఘ కాలిక ప్రణాఌకలు రూపొందిస్తామని హామి ఇచ్చారు. కాగా, ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రిగా చంద్రబాబు ఈ నెల 8న గుంటూరులో ప్రమాణ స్వీకారం చేయనున్న విషయం తెలిసింది.