Site icon TeluguMirchi.com

చంద్రబాబు కంటతడి


ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు అసెంబ్లీలో ప్రసంగిస్తూ తీవ్ర భావోద్వేగంతో కళ్లు చెమర్చారు. రాజధాని నిర్మాణంపై మాట్లాడుతూ బాబు భావోద్వేగానికి లోనయ్యారు. “రాజధాని అంటే డ్రీమ్‌ సిటీ అని హేళన చేస్తారా? అంటూ ఆవేదన వ్యక్తం చేశారు. ప్రత్యేక హోదా, విభజన చట్టంలోని అంశాలు, కేంద్ర ప్రభుత్వం హామీల అమలుపై శాసనసభలో మాట్లాడినప్పుడు ఈ సంఘటన చోటు చేసుకుంది.

కేంద్రం నుంచి ఏ అంశానికి ఎంత సహకారం అందిందో, ఇంకా రావలసిందేంటో వివరిస్తూ… రాజధాని అమరావతి నిర్మాణం దగ్గరకు వచ్చేసరికి ముఖ్యమంత్రి చలించిపోయారు. రాజధానికి కేంద్రం చెప్పిన సాయం చేయకపోగా, అంతర్జాతీయ స్థాయి నగరాన్ని నిర్మించుకోవాలన్న తమ సంకల్పాన్ని ఎగతాళి చేస్తున్నారని ఆయన ఆవేదన వ్యక్తంచేశారు

Exit mobile version