కాంగ్రెస్ కుట్రల పార్టీ : చంద్రబాబు

కాంగ్రెస్ కుట్రల పార్టీ.. తెదేపాను దెబ్బతీయాలని చూస్తోందని చంద్రబాబు నాయుడు ఆరోపించారు. కరీంనగర్ జిల్లా రాయికల్ లో జరుగుతున్న ‘వస్తున్నా..మీకోసం’ యాత్రలో ఆయన మాట్లాడుతూ ముఖ్యమంత్రి, మంత్రులు గ్రామాల్లోని కనీస సమస్యలు పరిష్కరించడం లేదని, తెదేపా అధికారంలోకి రాగానే రైతు సమస్యలు పరిష్కారిస్తామంటే ముఖ్యమంత్రి ఎద్దేవాగా మాట్లాడుతున్నారనీ.. తమని విమర్శించే హక్కు కిరణ్ కుమార్ రెడ్డికి లేదని చంద్రబాబు ఆరోపించారు. రాష్ర్టంలో ఆధార్ కార్డుల పంపిణీ అస్తవ్యస్తంగా ఉండడం వల్ల నగదు బదిలీ రసాభాస అయ్యే అవకాశం ఉందని చంద్రబాబు నాయుడు అన్నారు.