Site icon TeluguMirchi.com

విభజనపై మాట మార్చలేను : బాబు

cbnరాష్ట్ర విభజనపై పార్టీ వెనక్కువెళ్లే పరిస్థితి లేదని తెదేపా అధినేత నారా చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు. సమైక్యాంధ్రకు మద్ధతు ప్రకటించాలని తనను కలవడానికి వచ్చిన సీమాంధ్ర సచివాలయ ఉద్యోగులతో బాబు పై విధంగా స్పందించారు. తెలంగాణపై మాట ఇచ్చి తప్పలేమని స్పష్టం చేసినట్లు తెలుస్తోంది. అయితే, సీమాంధ్ర ఉద్యోగులకు పూర్తి భద్రతను కల్పించడంలో ముందుంటామని ఉద్యోగులకు బాబు హామి ఇచ్చారు. తెలంగాణకు అనుకూలంగా 2008లో కేంద్రానికి లేఖ ఇవ్వడంతో పాటుగా, 2012 డిసెంబర్ లో జరిగిన అఖిలపక్ష సమావేశంలో ఆ లేఖకు కట్టుబడి వున్నామని తెదేపా స్పష్టం చేసిన విషయం తెలిసిందే. కాగా, బాబు నిర్ణయం పట్ల తెలంగాణ రాజకీయ జేఏసీతో పాటుగా, పలువురు తెలంగాణ వాదులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

Exit mobile version