ఢిల్లీ మాదిరిగానే ప్రజలు కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఊడ్చేసేందుకు రెడీగా వున్నారని చంద్రబాబు తెలిపారు. ఇటీవల జరిగిన నాలుగు రాష్ట్రాల ఎన్నికలే ప్రజలు కాంగ్రెస్ నుంచి విముక్తి కోరుకుంటున్నారనేదానికి నిదర్శనమని ఆయన అన్నారు. రాష్ట్రాన్ని నాశనం చేసిన కాంగ్రెస్ ప్రభుత్వం.. అభివృద్ధి చేశామని గొప్పలు చెప్పుకోవడం సిగ్గుచేటని ఎద్దేవా చేశారు. ఢిల్లీలో ఒక సామాన్యుడు ఏర్పాటు చేసిన పార్టీతో.. కాంగ్రెస్ అడ్రస్ లేకుండా పో్యిందని చంద్రబాబు అన్నారు. వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ ను తరమికొట్టాలని బాబు పిలుపునిచ్చారు.