కాంగ్రెస్ పార్టీ ప్రజల్ని మభ్య పెడుతోంది : చంద్రబాబు

Chandrababuతెదేపా అధినేత చంద్రబాబు నాయుడు మరోసారి కాంగ్రెస్ పై విరుచుకుపడ్డారు. దేశం మొత్తం సర్వనాశనం కావడానికి కాంగ్రెస్సే కారణమని బాబు ఆరోపించారు. ఈరోజు (శనివారం) సాయంత్రం ఆయన విలేకరులతో మాట్లాడుతూ.. ప్రజలను మభ్యపెట్టడానికి కాంగ్రెస్ పార్టీ యత్నిస్తుందని బాబు ఆరోపించారు. యూపీఏ ప్రభుత్వం పూర్తిగా.. అవినీతిలో కూరుకుపోయిందని.. దీనికి రాహుల్ సమాధానం చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు.

ఢిల్లీ మాదిరిగానే ప్రజలు కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఊడ్చేసేందుకు రెడీగా వున్నారని చంద్రబాబు తెలిపారు. ఇటీవల జరిగిన నాలుగు రాష్ట్రాల ఎన్నికలే ప్రజలు కాంగ్రెస్ నుంచి విముక్తి కోరుకుంటున్నారనేదానికి నిదర్శనమని ఆయన అన్నారు. రాష్ట్రాన్ని నాశనం చేసిన కాంగ్రెస్ ప్రభుత్వం.. అభివృద్ధి చేశామని గొప్పలు చెప్పుకోవడం సిగ్గుచేటని ఎద్దేవా చేశారు. ఢిల్లీలో ఒక సామాన్యుడు ఏర్పాటు చేసిన పార్టీతో.. కాంగ్రెస్ అడ్రస్ లేకుండా పో్యిందని చంద్రబాబు అన్నారు. వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ ను తరమికొట్టాలని బాబు పిలుపునిచ్చారు.