బాధితులను ఆదుకోవడంలో ప్రభుత్వం విఫలం : బాబు

cbnతుపాను బాధితులను ఆదుకోవడంలో ప్రభుత్వం పూర్తిగా వైఫల్యం అయ్యిందని టీడీపీ అధినేత చంద్రబాబు నాయిడు అన్నారు. తుపాన్ బాధిత ప్రాంతాలలో పర్యటించేందుకు చంద్రబాబు ఈ ఉదయం రాజమండ్రి చేరుకున్నారు. అనంతరం మీడియా తో మాట్లాడుతూ… ప్రభుత్వ వైఫల్యంపై అసెంబ్లీ, పార్లమెంటుల్లో పోరాడుతామని తెలిపారు. టీడీపీ అధికారంలోకి వస్తే రైతు రుణ మాఫీపై తొలి సంతకం చేస్తామని చెప్పారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు ఓట్లు కావాలి తప్ప… ప్రజా సమస్యల పరిష్కారం అవసరం లేదని దుయ్యబట్టారు. ప్రజలకు న్యాయం జరిగే వరకు తాము పోరాడతామని అన్నారు.