లక్ష్మీ నర్సింహస్వామి సేవలో చంద్రబాబు!

cbnతూర్పుగోదావరి జిల్లా పర్యటనలో ఉన్న తెదేపా అధినేత చంద్రబాబునాయుడు ఈరోజు (మంగళవారం) ఉదయం అంతర్వేది లక్ష్మీనర్సింహస్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఇటీవల సంభవించిన హెలెన్ తుపాన్ ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించేందుకు గానూ.. బాబు తూర్పగోదావరి జిల్లా పర్యటన చేపట్టిన విషయం తెలిసిందే. కాగా, ఈరోజు బాబు పశ్చిమ గోదావరి జిల్లాలో పర్యటించనున్నారు.