హైటెక్ కేబినెట్ మీట్

cabinet meeting highlights
ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మరో రికార్డ్ ను సొంతం చేసుకొన్నాడు. దేశంలోనే తొలిసారి కాగితపు రహిత మంత్రివర్గ సమావేశాన్ని నిర్వహించారు. ఈరోజు (సోమవారం) ఉదయం లేక్ వ్యూ అతిథి గృహంలో సీఎం చంద్రబాబు నాయుడు అధ్యక్షతన మంత్రివర్గం సమావేశమైంది. ఐపాడ్ లు పవర్ పాయింట్ ప్రజెంటేషన్
సాయంతో చర్చ జరుగుతోంది.

ఈ కేబినేట్ సమావేశంలో పలు కీలక అంశాలపై నిర్ణయాలు తీసుకున్నట్లు తెలుస్తోంది. విజయవాడ పరిధిలో రాజధాని నిర్మాణానికి సంబంధించిన భూసేకరణపైనా మంత్రి మండలి కీలక చర్చ చేపట్టనుంది. కొత్త పింఛన్ల పంపిణీపై కీలక నిర్ణయం తీసుకోనున్నట్లు సమాచారమ్. అక్టోబర్ 2 నుంచి పెంచిన పింఛన్లను పంపిణీ చేయాలని ప్రభుత్వం తీర్మానించిన నేపథ్యంలో.. దీనికి నేటి భేటీలో కేబినెట్ సూత్రప్రాయంగా ఆమోదం తెలిపే అవకాశాలున్నాయి.

మొత్తానికి.. కాగితపు రహిత కేబినేట్ మీటింగ్ నిర్వహించి చంద్రబాబు మరోసారి హైటెక్ బాబు అనిపించుకొన్నాడని తెలుగు తముళ్లు ఖుషి అయిపోతున్నారు.