ఇది రాజన్న రాజ్యమా.. రైతు వ్యతిరేక రాజ్యమా..!

 

ఏపీలో రైతులకు విత్తనాలు కూడా సరఫరా చేయలేని రాష్ట్ర ప్రభుత్వం.. రైతు దినోత్సవం చేయడం హాస్యాస్పదంగా ఉందని అన్నారు ఏపీ మాజీ సీఎం.. ప్రతిపక్ష నేత చంద్రబాబునాయుడు. పార్టీ ముఖ్య నేతలతో తాజాగా గుంటూరులో సమావేశమైన ఆయన మాట్లాడుతూ.. ‘ఆంధ్రప్రదేశ్‌లో రాజన్న రాజ్యం తెస్తామని ముఖ్యమంత్రి చెప్పారు. కానీ రైతు వ్యతిరేక రాజ్యం తెచ్చారు’ అని విమర్శనాస్త్రాలు సంధించారు.

అదేవిధంగా విత్తనాల తయారీ అంటే ఉప్మా, ఇడ్లీ తయారు చేయడంకాదని.. సాక్షాత్తూ మంత్రి వ్యాఖ్యానించడం సరికాదని చంద్రబాబు.. ఆరోపించారు. అలాగే… రైతులపై ఈ ప్రభుత్వ వైఖరికి ఇదే నిదర్శనమని చంద్రబాబు నాయుడు దుయ్యబట్టారు. ప్రజాసమస్యల పరిష్కారమే పార్టీ అజెండా అని, రైతులకు న్యాయం జరిగేలా ప్రభుత్వంపై ఒత్తిడి తెస్తామని ఈ సందర్భంగా  చంద్రబాబు స్పష్టం చేసినట్లు తెలుస్తోంది.