ఘటనకు సోనియా బాధ్యత వహించాలి!

cbnపార్లమెంటులో ఈ రోజు చోటుచేసుకున్న ఘటనకు కాంగ్రెస్ అధినేత్రి సోనియాగాంధీయే పూర్తి బాధ్యత వహించాలని టీడీపీ అధినేత చంద్రబాబు అన్నారు. ఢిల్లీలో మీడియాతో మాట్లాడుతూ.. ఘటనపై బీజేపీ అగ్రనేత ఎల్ కే అద్వానీ సహా జాతీయ నేతలందరూ మాట్లాడుతుంటే సోనియా, రాహుల్, ప్రధాని మాత్రం ఎందుకు నోరు విప్పలేదని మండిపడ్డారు. సొంత పార్టీ మంత్రులు, ఎంపీలు వెల్ లోకి వచ్చినా కాంగ్రెస్ మొండిగా వ్యవహరించిందని అసహనం వ్యక్తం చేశారు. సమస్య పరిష్కారం కోసం ఇరు ప్రాంత నేతలతో ఎందుకు సమావేశం నిర్వహించలేదని ప్రశ్నించారు.