తక్షణమే సమ్మె విరమించాలి: చంద్రబాబు

cbn
ప్రజా ప్రయోజనాల దృష్ట్యా విద్యుత్ ఉద్యోగులు సమ్మె ఆలోచనను విరమించుకోవాలని తెలుగుదేశం అధ్యక్షుడు చంద్రబాబునాయుడు విజ్ఞప్తి చేశారు. ప్రభుత్వం, ఉద్యోగుల పరస్పర సమన్వయంతోనే రాష్ట్రాభివృద్ధి సాధ్యమన్న ఆయన ఉద్యోగుల డిమాండ్ల పరిష్కారానికి తెలుగుదేశం సానుకూలంగా ఉందని స్పష్టంచేశారు. మెరుపు సమ్మె వల్ల సామాన్య ప్రజలతో పాటు అత్యవసర వైద్య సేవలపైనా ప్రభావం ఉంటుందన్న విషయాన్ని ఉద్యోగులు గ్రహించాలని కోరారు. బాధ్యతలు చేపట్టగానే కొత్త ప్రభుత్వం ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి సానుకూల నిర్ణయం తీసుకుంటుందన్న చంద్రబాబు తక్షణమే సమ్మె విరమించాలని కోరారు.