సోనియా అమలు చేస్తున్నది ఇటలీ రాజ్యాంగం: బాబు

cbnరాష్ట్ర విభజన కు సంభందించి హస్తినలో కూర్చుని ఏకాభిప్రాయానికి వచ్చామని కేంద్రం పేర్కోవడం సరికాదని టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు తెలిపారు. దేశంలో ఇంతకు ముందు ఏర్పడిన మూడు రాష్ట్రాల విభజన అసెంబ్లీ తీర్మానాల ద్వారనే జరిగింది. ఆనాడు కూడా అసెంబ్లీ తీర్మానాల ద్వారానే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఏర్పడిందని బాబు గుర్తుచేశారు. సోనియాగాంధీకి భారతీయ సంస్కృతీ సాంప్రదాయాలు తెలియవని, ఆమె ఇక్కడ ఇటలీ రాజ్యాంగాన్ని అమలు చేస్తున్నారని విమర్శించారు.