Site icon TeluguMirchi.com

దాసరిని విచారించిన సీబీఐ

dasari narayanaro cbiకేంద్రంలో ఓ కుదుపు కుదుపుతున్న బొగ్గు కుంభకోణం కేసు సినీ దర్శక, నిర్మాత, మాజీ కేంద్ర బొగ్గుశాఖ సహాయ మంత్రి దాసరి నారాయణరావుకు తాకింది. లక్షా 86 వేల కోట్ల బొగ్గు కుంభకోణంలో దాసరి పాత్రపై సీబీఐ ప్రత్యేక దృష్టి సారించింది. ఇందుకు సంబంధించి ఆయనను నాలుగు రోజుల క్రితం సీబీఐ విచారించినట్లు సమాచారం. 2006-2009 మధ్యకాలంలో బొగ్గు శాఖలో భారీ కుంభకోణం జరిగిందని కాగ్ నివేదిక ద్వారా వెలుగు చూసిన విషయం తెలిసిందే. అప్పుడు దాసరి బొగ్గు శాఖ సహాయమంత్రిగా ఉన్నారు. ఈ నేపథ్యంలో కేసుకు సంబంధించి మాజీ మంత్రులను ప్రశ్నించినట్లు సిబిఐ తెలిపింది. ఈ విషయాన్ని సీబీఐ ధ్రువీకరించింది. దాసరితో పాటు అప్పటి కేంద్రమంత్రి సంతోష్ బగ్రోడియాను విచారించినట్లు తెలుస్తోంది.

Exit mobile version