జగన్, విజయసాయి మెమోల కొట్టివేత

CBI court rejects Jagani Memosవైకాపా అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి, విజయసాయి రెడ్డిలకు మరోసారి నిరాశే ఎదురైంది. చార్జిషీట్ల విషయంలో సుప్రీంకోర్టు చెప్పిన నిబంధనలను సిబిఐ ఉల్లంఘించిందని.. వీరు దాఖలు చేసిన మెమోలను కోర్టు కొట్టివేసింది. జగన్ అక్రమాస్తుల కేసులో చార్జిషీట్లు దాఖలు చేయడంలో.. సుప్రీంకోర్టు చెప్పిన నిబంధనలను సిబిఐ ఉల్లంఘించిందని, కనుక దాల్మియాపై దాఖలు చేసిన చార్జిషీటును ఈ కేసులో చివరిదిగా పరిగణించాలని జగన్, విజయసాయి రెడ్డి తరుపున న్యాయవాదులు మెమోలు దాఖలు చేసిన విషయం తెలిసిందే.