షిండేకు సీబీఐ క్లీన్ చీట్ !

shindeముంబయి ఆదర్శ్ హౌసింగ్ సొసైటీ కుంభకోణంలో కేంద్ర హోంమంత్రి సుశీల్ కుమార్ షిండేకు సీబీఐ క్లీన్ చిట్ ఇచ్చింది. ఈ మేరకు ఈరోజు సీబీఐ బాంబే హైకోర్టు తెలిపింది. మహారాష్ట్ర ముఖ్యమంత్రిగా వున్న సమయంలో బినామీ పేరుమీద షిండే దక్షిణ ముంబయిలోని ఆదర్శ్ హౌసింగ్ సొసైటీలో ఓ ఫ్లాట్ కలిగిఉన్నట్లు ఆరోపిస్తూ.. ప్రవీణ్ వట్గోంకర్ అనే సామాజిక కార్యకర్త కోర్టులో పిటిషన్ దాఖలు చేసిన విషయం తెలిసిందే. ఈ పిటిషన్ ను విచారించిన కోర్టు.. తాజాగా షిండేకు క్లీన్ చీట్ ఇచ్చింది.