దానంపై కేసు !

Danam-Nagenderకాంగ్రెస్ సీనియర్ నేత, కార్మిక శాఖ మంత్రి దానం నాగేందర్ పైన కేసు నమోదు చేయాలని బంజారాహిల్స్ పోలీసులకు నాంపల్లి కోర్టు ఆదేశాలు జారీచేసింది. ప్రత్యేక తెలంగాణ రాష్ర్ట ఉద్యమంలో భాగంగా జనవరి 17న తెలంగాణ న్యాయవాదులు మినిస్టర్ క్వాటర్స్ నుండి తన నివాసానికి వెళ్తున్న దానంను అడ్డుకున్నారు. ఆందోళనకారులు దానం కాన్వాయ్ పై రాళ్లు రువ్వారు. దీంతో ఆగ్రహించిన దానం న్యాయవాదులపై దాడి చేసినట్లు ఆరోపణలున్నాయి.ఈ ఘటనపై న్యాయవ్యాది కోర్టుకు వెళ్లడంతో.. విచారణ జరిపిన న్యాయస్థానం దానం పై ఐపిసి 147, 148, 149, 160, 323, 427, 307. 506 సెక్షన్ల కింద కేసును నమోదు చేయాలని ఆదేశాలు జారీ చేసినట్లు తెలుస్తోంది.