వైకాపా నేత బాలినేని పై కేసు నమోదు

balineni-srinivas-reddyవిధి నిర్వహణలో ఉన్న సహకార శాఖ అధికారులను అడ్డుకుని వారిపై దౌర్జన్యం చేశారన్న ఆరోపణలపై ఒంగోలు ఎమ్మెల్యే, వైకాపా విప్ బాలినేని శ్రీనివాసరెడ్డితో పాటు మరో 20 మంది అనుచరులపై ఒంగోలు రెండో పట్టణ పోలీసులు కేసు నమోదు చేశారు. బుధవారం రాత్రి ఎమ్మెల్యేతో పాటు ఆయన అనుచరులు, వైకాపా కార్యకర్తలు తమను దూషిస్తూ, దౌర్జన్యానికి పాల్పడ్డారని సహకార శాఖ అధికారులు ఇచ్చిన ఫిర్యాదు కేసు నమోదు చేసినట్లు సీఐ శ్రీకాంత్ బాబు తెలిపారు.