సినీ నటి, రాజకీయ నాయకురాలు జయప్రద పై ముజఫర్నగర్ పోలీసు స్టేషన్లో ఎన్నికల నియమావళి ఉల్లంఘన కేసునమోదయింది. ఆమె ఇటీవలే రాష్ట్రీయ లోక్ దళ్ పార్టీలో చేరి ఉత్తరప్రదేశ్లోని బిజ్నోర్ లోక్సభ నియోజకవర్గం నుంచి పోటీ చేస్తున్నారు. జిల్లా అధికారుల అనుమతి తీసుకోకుండా నియోజకవర్గంలో మంగళవారం ఎన్నికల ప్రచార సభను నిర్వహించారని ఆరోపిస్తూ కేసు నమోదైనట్లు బుధవారం పోలీసులు వెల్లడించారు.