పార్లమెంట్ లో తెలంగాణ బిల్లును పెట్టే వరకు కాంగ్రెస్ ను నమ్మలేమని తెరాస ఎమ్మెల్యే కేటీఆర్ స్పష్టం చేశారు. ఖమ్మంలో కేటీఆర్ విలేకరులతో మాట్లాడుతూ.. తమ పార్టీలోని నేతలకు న్యాయం చేయలేని జగన్, సమన్యాయం పేరిట దీక్ష చేయడం సిగ్గుచేటని అన్నారు. పోలవరం పేరిట గిరిజనులను ముంచేందుకే భద్రాచలాన్ని ఆంధ్రాలో కలపాలని డిమాండ్ చేస్తున్నారని కేటీఆర్ మండిపడ్డారు.