లోక్సత్తా పార్టీ ప్రచారంలో కనిపించి అందరినీ షాక్ కి గురి చేశాడు రాజమౌళి. ముందు నుంచీ జక్కన్న లోక్ సత్తాని సమర్థిస్తూ వచ్చినవాడే. అయితే తొలిసారి ఇలా బయటకు వచ్చి, ఎన్నికల ర్యాలీలో పాల్గొన్నాడు. లోక్ సత్తాకి జై కొట్టి – ఆ పార్టీ శ్రేణుల్లో కొత్త ఉత్సాహం నింపాడు. అక్కడితో ఆగడం లేదు. లోక్ సత్తా ప్రచార బాధ్యతనీ తానే తీసుకొన్నాడట. ఈ పార్టీ కోసం కొన్ని ప్రచార చిత్రాల్ని రూపొందించే పనిలో ఉన్నాడు రాజమౌళి. యువతరం ఓటు హక్కు వినియోగించుకోవాలి… అని చెబుతూనే, నీతి నిజాయతీలకు నిలువుటద్దమైన జేపీకి ఓటేసి గెలిపించండి అని చెప్పడం ఆ ప్రచార చిత్రాల కాన్సెప్ట్ అని తెలుస్తోంది. ఓ వైపు బాహుబలి షూటింగ్ లో బిజీ బిజీగా గడుపుతూనే లోక్ సత్తా ప్రచార చిత్రాల కోసం సన్నాహాలు చేస్తున్నాట. మరి అవి ఏమాత్రం ప్రభావితం చేస్తాయో, లోక్ సత్తాకి ఎన్ని ఓట్లు పడేలా చేస్తాయో తెలియాలంటే ఎన్నికల ఫలితాలు వచ్చే వరకూ ఆగాలి.